వాడికి లాభం చేకూరకపోతే తత్వ శాస్త్రాలు వ్రాస్తారు.......

ఇది నిజం,
ఎవరో ఎందుకు నేనే వ్రాస్తున్నాను కదా.
తెలివైన వాడికి అర్ధతత్వం అర్ధం కాకపొతే వాడికి అర్ధం అయిన వాటిని మాత్రమే అనుసరిస్తాడు.
అర్ధతత్వం లో ప్రావీణ్యం కలిగిన వాడి పైన విశ్లేషించిన  వాళ్ళని తన గుంపులో చేర్చుకుని ప్రకృతి హాని కలిగిస్తాడు.

దేవుడు లేడు అనే ఈ నాగారీకులకు కావాల్సింది డబ్బు మాత్రమే.
 వీళ్ళకు పారిశ్రామికీకరణ మాత్రమే మోక్షం, కానీ cosmic law ప్రకారం చెడు పెరుగుతుంటే దాన్ని ఆపడానికి మంచి పెరుగుతూ ఉంటుంది. ఇదే మనం ప్రకృతి వైపరిత్యం అనుకోవచ్చు.
SEZ ల కోసం అని కాకినాడ చుట్టూఉన్న గ్రామాలను చెట్లను నరికారు, ప్రకృతి ధర్మం ప్రకారం ఎండాకాలంలో ఎండా వానాకాలంలో వానలు చలికాలంలో చలి ఉండాలి. అదే ప్రకృతి ధర్మం ప్రకారం చెట్టు నీడను ఇస్తుంది, మరి అలాంటి చెట్టును నరికి వేస్తే నీడ ఎక్కడది? అదే జరిగింది వేల ఎకరాల భూములలో చెట్లు నరికేయడం వల్ల మొన్నటికి మొన్న మా స్వగ్రామం(రాజోలు) మరియు పరిసర ప్రాంతాలలో ఉష్ణోగ్రత ౪౭ కు చేరింది.
ఇది "చెట్టు దేవుడు కాదు అని నిరూపించిన" తత్వశాస్త్ర ప్రావీణ్యుల తప్పా దాన్ని చదివి ప్రకృతి ధర్మాన్ని విస్మయించిన వీళ్ళదా తప్పు?

కాదు నాది అనిపిస్తుంది. తెలిసి కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితి, ఎందుకంటే బ్రతకడానికి డబ్బు ముఖ్యం చేసిన తత్వ శాస్త్ర ప్రావీణ్యులు, ఇన్ని జరుగుతున్నా నా ఉద్యోగం వదిలి ప్రకృతి మాత ఒడిలో చేరి సేవచేయ్యలేక పోతున్నందుకు.

1 comment:

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.