అందరికీ అన్నం అందిచాలి!

కానీ ఆ అన్నం పండించే స్థలంలో రాజధాని కట్టాలి, ఇదెక్కడి న్యాయమో అర్ధం కావట్లేదు!
అసలు cpi వాళ్ళు చదువుకున్న వాళ్ళా చదువుకున్న మొద్దులా అర్ధం కావట్లేదు, ఇక కొన్ని సంస్థల సంగతి ఇంకా అద్వాన్నం అది వేరే విషయం.
ప్రజల పక్షం అన్న వీళ్ళు ఈ విషయాల గురించిని ఎందుకు పట్టించుకోరు?
౧. యంత్రీకరణ - దీని వల్లే నిరుద్యోగం పెరుగుతుంది
౨. చెరువులు - ఉన్నవాటిని పూడ్చడమో లేదా చేపల చెరువులుగా మారుస్తున్నారు, దాని వల్ల నీటి లభ్యత తగ్గి వేసవి దాహం తీరట్లేదు
ఇవన్నీ పెట్టుబడీ దారి వ్యవస్థ దాన్ని నశింప జేయ్యాలి అంటారు కానీ వీటిని కాపాడాలి అనరు!
ఇక మనం, రహదారుల వెంబడి చెట్లు నాటుతాం అనే ప్రభుత్వం ఏమి చెట్లు నాటుతుంది అని ప్రశ్నించం, ఎందుకంటే మన ఇల్లు మనకు ఉంది కాబట్టి.
ప్రజల చే ఎన్నుకోబడిన నాయకులారా, ఈ కొన్నిటినీ మళ్ళీ పునరుద్దరించండి
౧. ప్రజలకు ఉపయోగ పడే చెట్లు రహదారుల వెంబడి నాటండి, ఆ పిచ్చి గడ్డి వాటిని పెంచకండి.
౨. చెరువులను కాపాడండి వేసవి దాహం తీర్చండి
3. ఆనకట్టలు కావాలి కానీ వాటిలో పూడుకున్న చెత్త లేదా ఇసుక గురించి కూడా ఆలోచించండి, తీయడానికి కొంచం ముందస్తు ప్రనాలీకలు సిద్దం చెయ్యండి
౪. వర్షా కాలంలో ప్రాణాపాయం ఉన్న పర్యాటక ప్రదేశాలను మూసి వెయ్యండి
౫. సాగు భూమిని బీడు భూమిగా మార్చకండి!
౬. ఇల్లు కావాలి కన్నా నీడ కావాలి అన్నవిషయం గుర్తించండి.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.