కలిసి ఉంటే కలదు సుఖం - విడిపోతే Super Markets (తస్మాదపరిహార్యేర్ధే - అయిదవ భాగం)

స్వామి:నేను ఇక్కడకు వచ్చినది తస్మాదపరిహార్యేర్ధే, ఈ ఆశ్రమం పెద్ద రామానుజుల వారు, వారు ఒప్పుకుంటేనే నీకు ఇక్కడ ఉండే ఆస్కారం లభిస్తుంది.

అగమ్యి: మీరు ఇక్కడ పెద్ద దిక్కు కదా.
స్వామి: కానే కాదు, నేను నీలాగే ఇక్కడకు వచ్చిన వాడిని.
అగమ్యి గమ్యం లభించింది
రామానుజులు: రేపు నీకే పరిచయం చేస్తాను.

తరువాత రోజు ఉదయం మళ్ళీ చర్చా గోష్ఠి మొదలయ్యింది.
స్వామి: నిన్న మీకు చెప్పాను కదా మనం విడిపోవడం వల్ల జనం చేతిలో డబ్బులు ఉన్నా సరుకులు కొనడం మానేసి shares కొనడం లాంటివి చెయ్యడం వంటివి అలవాటు చేసుకున్నారు, అవసరం ఉన్నవాడు అడిగితే ఇవ్వడం మానేసారు. అంతెందుకు నేనే చాలా సార్లు నా బంధువులు పంట వెయ్యడానికి డబ్బులు కావాలి అంటే ఇవ్వలేదు, కానీ నా స్నేహితులు మందు party కి డబ్బులు ఇచ్చిన సందర్భాలు అనేకం.
భారతీయుడు: వాటికి FDI లకు సంబంధం ఏమిటి?
స్వామి:ఏముంది ఇలా అవసరం ఉన్నవాడికి సాయం చెయ్యడం మానెయ్యడం మరియు shares లో డబ్బులు ఉంచడం పెరిగి ద్రవ్యం అవసరమైన వారికి అందలేదు.
భారతీయుడు:మరి FDI ల దగ్గర ఎలా ఉంది ద్రవ్యం?
స్వామి: ప్రజలకు పిచ్చి పెరిగిపోయి, ఒక్కొక్కడికీ ౪ గృహాలు ఉండడం,వాటి మీద వచ్చే అద్దె ఏమి చేసుకోవాలో అర్ధం కాక మందుకు బానిస అవ్వడం, తరువాత మళ్ళీ shares కొనడానికి మళ్ళించడం. డబ్బు ఎక్కడ పుట్టింది అన్నది అప్రస్తుతం చివరికి shares లోకి మారడం పరిపాటి. ఇలా ధనమంతా అవసరం లేని చోటకి మరలిపోయింది, ఇక FDI లకు డబ్బులు కావాలి పెట్టుబడులు పెట్టడానికి, అందుకు ఇక్కడ సంస్థలతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారు, అందులో మొదటిది FMCG shares ధరలు పెంచడం, ప్రజలు పిచ్చి వాళ్ళు కాదు కదా కొన్నిసార్లు అందుకు కారణం FDI లు వచ్చాకా ఈ సంస్థల లాభాలు పెరుగుతాయి అని అసత్య ప్రచారం చెయ్యడం, దీని వల్ల మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు మన దగ్గర ధనమే తీసుకున్నారు.
భారతీయుడు:అసత్య ప్రచారం ఏమిటి? అది నిజం కదా.
స్వామి:నిజం కాదు, వాళ్ళు వచ్చాకా మొదట్లో ఈ సంస్థల నుంచీ కొనుగోలు చేసారు, తరువాత లాభాలు రావడంతో వాళ్ళే సంస్థలు స్థాపించారు, శీతాకాలంలో మామిడి పళ్ళు అమ్మారు.
భారతీయుడు:శీతాకాలంలో మామిడి పళ్ళు అమ్మే స్థాయికి వచ్చాం కదా ఇంకేమిటి మీ బాధ?
స్వామి:నీకు నేను ఏమీ తీసిపోలేదు, నీలాగే ఆలోచించాను, తరువాత తెలిసి వచ్చింది ఈ తప్పులకు పర్యవసనం. ఇది వరకు రోజులలో పాలు నిల్వ ఉంచేవారు కాదు, ఒక వేళ ఉంచాల్సి వచ్చినా పాలు రోజుకు రెండు మార్లు మరిగించే వారు, కానీ ఇప్పుడు కాలంలో పాలు పాల packets లో నిల్వ ఉంచడం, అవసరం ఉన్నా లేకపోయినా రోజూ పాల ఉత్పత్తి పెంచడం, ఉత్పత్తి పెరిగి వినియోగం తగ్గిపోవడం వల్ల అవన్నీ పడెయ్యడం లేదా నిల్వ ఖర్చు అనవసరంగా ఇంధనం వ్యర్ధం చెయ్యడం పెరిగి పోయింది.తీరా చేసి రైతులకు ఏమైనా మిగిలిందా అంటే లేదు, వాళ్ళ కష్టాలు ఇంకా పెరిగిపోయాయి.
భారతీయుడు:ఆగండి వినియోగం ఎందుకు తగ్గింది?
స్వామి:ఒకప్పుడు పాలు ఉదయం సంధ్యా సమయంలో తాగడం అలవాటు, నేడు కొంతమంది ప్రజలకు రుచులు బాగా అలవాటయ్యి పాలు తాగడం కన్నా వేరేవి తాగడం మొదలు పెట్టారు, ఇంకొంత మంది ప్రజలు పాలల్లో వెన్న శాతం ఎక్కువ కాబట్టి పాలు తాగడం మానేశారు, ఇంకొంతమంది పాలల్లో వెన్న తీసిన పాలు తాగే వారు మరి ఆ వెన్న ఎవరు ఉపయోగిస్తున్నారు? అది వ్యర్ధం కదా, పోనీ కొనలేని పోషక విలువలు కక్కువ ఉన్నవారికి ఇచ్చారా ఉచితంగా అంటే లేదు, అలా చేస్తే ప్రజలు శక్తి వంతులు అవుతారు, రాజకీయ నాయకులకు పోషక విలువలు గురించి ఉపన్యాసం ఇచ్చి ప్రజలను votes గా మార్చుకునే అవకాసం పోతుంది.
(సశేషం....)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.